పడిలేచిన కడలి తరంగం - “అభినవ మొల్ల” డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ, భద్రాచలం ఆమె జీవితం రాళ్ళలో చిలికిన సెలయేరు. దానిని పావన గోదావరిగా మార్చుకుందామె. ఆమె పడిలేచిన ఒక కడలి తరంగం! రాముడు వెలసిన భద్రాచలం రాజవీధిలో ఆమె అక్షర రాణి సౌరభ వాణి. బాధలను ధిక్కరించిన వెలుగు ఆమె కవిత్వం! ఆమె “అభినవ మొల్ల” బిరుదాంకితురాలు డా. చక్రవర్తుల లక్ష్మీనరసమ్మ. శ్రీ పొడిచేటి వీర రాఘవాచార్యులు, శ్రీమతి నరసమాంబ దంపతుల రెండవ సంతానంగా 1939 జనవరి 3వ తేదీన ఆమె జన్మించింది. తండ్రిగారు ఆగమశాస్త్ర పండితులు. భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో 60 సంవత్సారాలు ప్రధానార్చక పదవిలో సేవలందించిన మహనీయుడు. ఉదాత్త చరితుడు. అజాత శ్రతువు అంటారు అందరు. ఆరుగురు సోదరీమణులు, నలుగురు సోదరులకు ప్రేమ, ఆప్యాయతలు పంచి జీవితానుభవాల నిఘంటువులో ప్రేమ అనే రెండక్షరాలకు అర్థం ఆమె. వారిది సనాతన కుటుంబం. 9 సంవత్సరాలకే వివాహం జరిపించారు. శారదా బిల్లు చట్టం ఉన్న ఆ సమయంలో ఆమె వివాహం రహస్యంగానే జరిగింది. అత్త, ఆడపడుచుల ఆరళ్ళతో అత్తవారింట
ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్లు
ఎండ్లూరి మానస ఇంటర్వ్యూ
2020 సంవత్సరం "'కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం" గెల్చుకున్న మానస ఎండ్లూరితో జ్వలిత చేసిన ఇంటర్వూ 1.జ్వలిత : కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన మీకు ముందుగా శుభాకాంక్షలు. ఈ పురస్కారం పొందిన సందర్భంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ? మానస ఎండ్లూరి : ఈ పురస్కారం పొందిన అందుకు నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. అయితే దీన్ని గుర్తింపు అనే కంటే కూడా గౌరవం అనుకుంటున్నాను. ఎందుకంటే అస్తిత్వాన్ని రాసుకునే రచయితలకు వచ్చే గుర్తింపు, గౌరవం ఆ రచయితకే కాదు తన జాతికి తన వర్గానికి వర్తిస్తుందని నమ్మేదాన్ని. ఒక స్త్రీవాదిగా, ఒక బహుజన వాదిగా, ఒక దళిత వాదిగా అట్టడుగు వర్గాల స్త్రీల గురించి ఆ వర్గపు.. ముఖ్యంగా దళిత క్రైస్తవ మనుషుల గురించి నేను రాస్తున్నాను కాబట్టి ఈ పురస్కారం అనేది ప్రతి ఒక్కరిని గౌరవిస్తుందని నేను భావిస్తున్నాను మేడం. 2. జ్వలిత : చాలా గొప్ప భావన, వ్యక్తిగతంగా కాకుండా, అస్తిత్వ స్పృహతో చాలా గొప్పగా ఉంది మీ సమాధానం. విహంగ పత్రిక బాధ్యత, విహంగ పత్రికలో మీ సాహిత్యం గురించి చెప్పండి ? మానస ఎండ్లూరి : విహంగ అనేది అంతర్జాలంలో మొట్టమొదటి మహిళా సాహిత్య పత్రిక. అది 2011ల
జిల్లేడు కాయ(కరోనా కథ))
జిల్లేడుకాయ "కిషన్ రావు సంగతి తెలిసిందా! "గోపాల్రావు "ఏమైంది"వాసు. "హాస్పిటల్లో ఉన్నాడట" గోపాల్రావు. "ఎందుకు మళ్ళేమయింది" వాసు. " అవును ఇంతకుముందు కూడా పదిరోజుల వరకు హాస్పిటల్లో ఉన్నట్టున్నాడు కదా బాయ్" ఆలి. "ఏదో స్కిన్ ఎలర్జీ అట" గోపాల్రావు. "అంతే కాదు గుండెలో మూడు వాల్వులు బ్లాక్. అయినయట" వాసు. "ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు కదా" క్రిష్టఫర్. "అందరికీ పెళ్లిళ్లయ్యాయి కొడుకు అమెరికాలో ఉంటాడు" గోపాల్రావు. " భార్య భర్తలు ఇద్దరే ఉంటున్నారు" వాసు. "అయితే ఏమిలే ఇద్దర బిడ్డలు ఇదే ఊర్లో ఉంటారట కదా బాయ్" ఆలి. "ఎక్కడ ఉంటే ఏముంది బాధ్యతలన్నీ తీరిపోయాయి కదా" క్రిష్టఫర్. " బాధ్యతలు తీరడం అంటే పెళ్లిళ్లు చేయడం తోటే అయిపోదు" వాసు. "అది కాదు లేరా బాబు, ఇప్పుడు కష్టపడి, పడీపడి అప్పులు చేసేంత అవస్థ లేదని" రామకృష్ణ. "ఎంత చెట్టుకు అంత గాలి, ఎవరికీ ఉండే కష్టం వారికుంటుంది" వాసు. "రేపు ఒకసారి పోయి చూసొద్దాం" గోపాల్రావు. "అప్ప
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి