"మూలమలుపు" సమీక్ష
'మూలమలుపు'లో బతుకు చిత్రాల కవిత్వం. సాహితీలోకంలో ఏనుగు నరసింహా రెడ్డి గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదేమో. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి కాక ముందు నుండే ఒక కవిగా సుపరిచితులే. చిన్న పత్రిక నుండి అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రికల వరకు , అన్ని పత్రికల్లోనూ వారి కవిత్వానికి ఎందరో పాఠకులు ఉన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా రచనా వ్యాసంగంలో అనేక ప్రక్రియల్లో వారు రచనలు చేస్తున్నారు. ఆంధ్రప్రభలో 2016 నుండి అప్రతిహతంగా ప్రతి వారం రాసే రూబాయిలు వారి సాహితీ వ్యవసాయానికి నిదర్శనం. "పుస్తకాలు లేని ఇల్లు ఎడారి" అని చెప్పే ఈ కవి , తనను కలిసిన అందరికీ పుస్తకాలను జ్ఞాపికలుగా అందిస్తూ అక్షర సేద్యానికి విత్తనాలను పంచుతారు. యాదాద్రి భువనగిరి జిల్లా మూసీతీరంలోని కల్లోనికుంటలో జన్మించి, నల్గొండ జిల్లా చిట్యాలలో పెరిగిన వీరి ప్రతి అక్షరంలోతెలంగాణ భాషాసౌందర్యం తొణికిసలాడుతుంది. "అంతరంగం" అనే వీరి ఆధునిక కవిత్వ విమర్శ గ్రంథంలో ఇరవై ఆరు వ్యాసాలున్నాయి. వారి సునిశిత పరిశీలన , సున్నితమైన విమర్శకు అద్దంపడుతుంది ఈ "అంతరంగం"అనే పుస్తకం. ఈ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి