పూనాచ్చి 2 పెరుమాళ్ మురుగన్ ఆత్తూర్ తమిళంలో రచించిన "పూనాచ్చి " తమిళ నవలకు గౌరీ కృపానందన్ తెలుగు అనువాదం 'పూనాచ్చి' ఒక మేక పిల్ల కథ. 2014లో "మాధొరు భాగన్" తమిళ నవలకు ఆంగ్లానువాదం 'వన్ పార్ట్ విమన్'కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. దాని తెలుగు అనువాదమే 'అర్థనారీశ్' . అవార్డు ప్రకటన తర్వాత తమిళనాడులో వివాదాలు మొదలయ్యాయి. పెరుమాల్ మురుగన్ పై కేసులు పెట్టి, అరెస్టు చేయాలని, పుస్తకాన్ని నిషేధించాలని కొన్ని సమూహాలు ప్రయత్నించాయి. మద్రాస్ హైకోర్టు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగకుండా, భావప్రకటనా స్వేచ్ఛను గుర్తు చేస్తూ, పిటిషన్ను కొట్టివేసింది. సుప్రీం కోర్ట్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ప్రకారం దేశంలోని ప్రతి ఒక్కరు తమ భావాలను వ్యక్తపరచవచ్చని. "పెరుమాళ్ మురుగన్ రచన నచ్చకపోతే కొనకండి , చదవకండి, కానీ ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛను హరించకండి" అని చెప్పడంతో వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పుతో "వివాదాలు దాడులతో రచనా వ్యాసంగాన్ని వదిలేస్తున్నాను" అని ప్రకటించిన మురుగన్ తో పాటు అనేకమంది కవులకు రచయితలుకు ధైర్యం ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి