పోస్ట్‌లు

ఇప్పటికీ కొనసాగుతున్న విషాధకామరూప

 ఇంకా కొనసాగుతూన్న 'విషాద కామరూప'-2 సమీక్షకులు- జ్వలిత.9989198943 "విషాద కామరూప" నవల అస్సాం రాష్ట్రంలోని, కామరూప జిల్లాలోని, ఒక మారుమూల 'సత్త్ర' అని పిలువబడే వైష్ణవ మఠాల చుట్టూ ఉన్న చిన్న గ్రామం. ఆనాటి సత్రాల దయనీయ స్తితితో పాటు, అస్సాం సంస్కృతిలోని ప్రతి సూక్ష్మ అంశాన్ని 'కామరూప' అనే మాండలికంలో ఇందిరా గోస్వామి "ఊనే ఖోవా హౌదా" అనే అద్భుతమైన నవలగా రాసారు. కామరూప మాండలిక భాష చాలా తక్కువ మందికి వచ్చు కాబట్టి. దానిని తిరిగి ఇంగ్లీషులోకి "ఏ సాగా ఆఫ్ సౌత్ కామరూప" అనే పేరుతో అనువాదం చేయవలసి వచ్చిందని రచయిత్రి తన ముందు మాటలో చెప్పుకున్నారు. దానికి తెలుగు అనువాదం చేసినవారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు. 'కేంద్ర సాహిత్య అకాడమీ' 2002వ సంవత్సరంలో మొదటిసారి ఈ నవలను ప్రచురించింది . 19వ శతాబ్దం ప్రథమ భాగంలో 1820 మొదలు బ్రిటిష్ పాలన అంతరించి భారతదేశం స్వాతంత్రం పొందేదాకా సుమారు 125 ఏళ్ల పాటు ఈ నవల ఇతివృత్తకాలం. అస్సాంలోని ప్రసిద్ధ వంశమైన ఒక గోసాయి కుటుంబంలో జరిగిన విషాద గాధ ఈ నవలకు ఇతివృత్తం. గోసాయిలు లేదా గోస్వామీలు...

పగబట్టాడు(కథ)

పగబట్టాడు (కథ) "ఒరేయ్ శుక్రాచార్యుడా ఇటురా గట్టిగా అరిచాడు" లెక్కల పంతులు. క్లాసులో పిల్లలు అందరూ గొల్లున నవ్వారు శుక్రాచార్యుడుగా పిలవబడే కేశవదాసు బిక్కచచ్చి నిలబడ్డాడు అతడికి ఈ అవమానం కొత్తేమి కాదు దుఃఖం వచ్చింది. చెట్టు కింద పదవతరగతి క్లాస్ నడుస్తోంది. మొదటి పిరియడ్లోనే పరీక్ష పేపర్లు దిద్ది పిల్లలకు మార్కులు చెబుతున్నాడంటే క్లాస్ టీచర్ కూడా లెక్కల పంతులే అన్నమాట. ఆయన చాలా ముదురు. యూనియన్ లీడర్ కూడా. పక్కనే వరండాలో కూర్చుని ప్రోగ్రెస్ రిపోర్ట్ లు తయారు చేస్తున్నారు ఇద్దరు టీచర్లు. అందులో ఒకామె "అదేంటి శుక్రాచార్యుడు అని పిలుస్తారు. నిజంగా ఆపేరుతో విద్యార్థి ఉన్నాడా" అన్నది. ఆమె కొత్తగా వచ్చిన వసంత టీచర్. "అవును వాడికి ఒక కన్ను కనిపించదు కదా అందుకోసం అన్నమాట" హిందీ టీచర్ సమాధానం చెప్పింది. " అయినా పిల్లలకు అటువంటి నిక్ నేమ్స్ పెట్టకూడదు కదా" "ఔను, అవసరం ఉన్నా లేకున్నా కూడని పనులే ఎక్కువ జరుగుతాయి. తరగతి గదిలో, పాఠశాలల్లో, కుటుంబాల్లో , సమాజంలో ప్రతిచోట" "సరే మిగిలినవి అంటే మన చేతిలో లేనివి. మనం టీచర్లం కదా , రేపటి త...

బహుళ-3,కథానెచ్చెలి, దాసరి శిరీష

 బహుళ-3 దాసరి శిరీష కథ "వ్యత్యాసం" వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథకు శతాధిక సంవత్సరాలు నిండిపోయిన సమయంలో కరోనా కరాళ నృత్యం కథలపై కూడా ప్రభావం చూపిస్తోంది. అయినా ప్రపంచవ్యాప్తంగా తెలుగు కవులు రచయితలు భయపడకుండా అంతర్జాలంలో సాహిత్య జాతరలు నడుపుతూనే ఉన్నారు. కరోనా కథల సంపుటాలు వెలువడుతున్నాయి. లిఖిత కథల ముందు మౌఖిక కథలకు చెప్పలేనంత నష్టం జరుగుతూనే ఉన్నది. లక్షల కొద్దీ రాతప్రతుల్లో, నాలుగు లక్షలకు పైగా అచ్చయిన పుస్తకాల్లో కథ తన అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఉన్నది. అయితే మౌఖిక కథకు జరిగినట్టే 'బహుజని' కథలకు వివక్ష ఎదురైంది. కథ సమాజంలో అంతర్భాగం. జీవితంలోని సకల కోణాలకు ప్రతిబింబం. అందువల్లనే మొదటి తెలుగు కథ బండారు అచ్చమాంబ అయినప్పటికీ, కథా సాహిత్యంలో స్త్రీకథలు పితృస్వామ్యానికి బలయినాయి, వివక్షకు గురయినాయి. అయితే వివక్ష అనేది కులం, మతం, జెండర్ , ప్రాంతం, వర్గం, రంగు వంటి అనేక కారణాలుగా జరుగుతుందని మనకు తెలుసు. విద్యావంతులైన స్త్రీలు కూడా అనేక వివక్షలకు గురవుతున్నారు. వివక్షకు గురవుతున్న స్త్రీలు కూడా మరొకరి పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారు. స్త్రీలలో ఒక బలహీన...

బహుళ-2,కథానెచ్చెలి-నందగిరి ఇందిరాదేవి

 బహుళ - 2 నందగిరి ఇందిరదేవి "వాయిద్యం సరదా" కథ ఏమి చెప్తుంది ? జీవిత అనుభవాన్ని చెప్తుంది. కథాకాలం నాటి సామాజిక సంబంధాలకు సంఘటనలకు అద్దం పడుతుంది. కాలానుగుణంగా పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను తెలిపి కరదీపమై మార్గదర్శనం చేస్తుంది. అటువంటి కథే "వాయిద్యం సరదా" అనే కథ. దీనిని నందగిరి ఇందిరాదేవి రాశారు. 1941 మే నెల "గృహలక్ష్మి మాసపత్రిక"లో ప్రచురింపబడింది. కథాంశాన్ని బట్టి నాటి సామాజిక పరిస్థితులను రచయిత్రి మనకు కళ్ళకు కట్టిస్తారు. కథలో మీనాక్షి తన భర్తను "అయ్యవారూ" అని పిలుస్తూంది అనడంలో నాటి భార్యలు పనిమనుషులుగా భావించబడ్డారని తెలుస్తూంది(ఎక్కువ మంది). "యజమాని తనచేతికి డబ్బు ఇవ్వడు కనుక సంపాదన లేని మీనాక్షి కూరగాయలకు ఇచ్చిన వాటిలో పొదుపు చేసి హార్మోనియం కొనాలి అనుకుంటుంది" అని చెప్పారు కథకురాలు. ఆవిధంగా ఎటువంటి ఆర్ధిక స్వాతంత్ర్య లేకుండా నాటి స్త్రీలు పరాధీనలుగా ఉండేవారని తెలియజేశారు. "మీనాక్షి హార్మోనియం పెట్టెను ఆమె కళ్ళ ముందే పది రూపాయలకు నరసింహం అమ్మేస్తాడు" భార్య అభిరుచులపై ఆమె వస్తువులపై అతని నిరంకుశ ప్రవర్తన అర్థం...

బహుళ-1కథానెచ్చెలి-అచ్చమాంబ

 కథా నెచ్చెలి 1 జీవితాలను , అనుభవాలను ప్రతిబింబిస్తూ అనాదిగా మనిషికి ఊరటను కలిగించేది కథ. కథకు నిర్వచనం చాలామంది చాలా రకాలుగా చెప్పినా, స్థూలంగా గ్రహించే అంశం "ఒక సన్నివేశం, ఒక పాత్ర, ఒక మనోస్థితి, వీటిలో కొన్నింటిని లేదా అన్నింటినీ ఆధారంగా చేసుకుని సాగే ఇతివృత్త వివరణ కథ". కథలో చెప్పిన అంశానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో, చెప్పకుండా ఒదిలి ఆలోచన రేకెత్తించే వాటికి అంతే ప్రాధాన్యత ఉండడం కథ ప్రత్యేకత. ఈ ప్రత్యేకతే సాహిత్యంలో కథను నవల, నాటకం నుండి విభిన్నంగా నిలిపాయి. హాలుని గాధాసప్తశతి ప్రాకృతభాషలో లిఖిత పూర్వక భారతీయ తొలి కథాసంపుటి. 19వ శతాబ్దంలో తెలుగులో బ్రౌన్ "తాతాచార్యుల కథలు", మధిర సుబ్బన్న దీక్షితులు "కాశీ మజిలీ కథలు", మర్యాద రామన్న కథలు, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యులకథలు, చార్ దర్వేష్ కథలు, బట్టి విక్రమార్కులకథలు, మెకంజీ కైఫీయత్తులలోని వివిధ స్థల పురాణాలు, వివిధ చేతివృత్తులవారికథలు , గిరిజనుల కథలు, జానపద కథలు, పొడుపు కథలు మొదలైనవి. గోండులు చెప్పుకునే కథల్ని "ఎల్విన్", చెంచులు చెప్పుకునే కథలు "హైమన్డార్ఫ్" సంకలనం చ...

ఆయుధం కాదు ఔషధం

 వలసల చేతిలో ఔషధం(శీర్షిక) రచన-జ్వలిత-9989198943 బతుకుదారితోపాటు ఆశలకనుగుడ్డు సొన కారిపోయింది మనిషి నేలను నడకతో కొలుస్తూన్నాడు నెత్తురోడే బచ్చేదాన్లున్న బాలింతలకే కాదు అరికాళ్ళకు నెత్తుటి సంచులు మొలుస్తున్నాయి చెమటతో తడిసిన జీవితం కన్నీటి చారలతో అట్టలు కట్టిందిఏ పాలమరకలు పెదవికి చేరట్లేదు నీటిచుక్కలు గొంతు తడపట్లేదు మద్యం మహానదిలా పారుతూ మూత్రపుతిత్తులు చిల్లులుపడుతున్నాయి ఉమ్మనీటి సంచులు నెత్తుటిమడుగులౌతున్నాయి కడుపు చేతబట్టి దేశం పట్టిన మనిషి గూడు చెదిరిన పక్షయి గుండె చెదిరాడు ప్రాజెక్టు నీళ్ళతో నేలలు తడిచినా బతుకు మీద నమ్మకం దొరకట్లేదు కొత్తగా చెరువులకు గండ్లు పడి బతుకులు మునుగుతనే ఉన్నయి పట్టీపట్టని బాధ్యత ఉండీలేని బోడిగుండయింది ఉరిమిన ఊరువు, ఉబికిన రవికె చెదిరిన ధైర్యం, బెదిరిన గుండె కాలు కలిపి కదలిన రాదారయ్యింది పాతదే స్వార్ధం కొత్త కరోనాతో కలిసి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుతోంది పాజిటివ్ వచ్చిన వాళ్ళే కాదు మనమంతా భయం పంజరంలో పిట్టలమే హంస ఎగిరిపోకుండా మిగిలి ఉంటే ఓటు ఆయుధం కాదు ఔషధమని వైద్యం చేద్దాం .. ... .... ...

మనమే చేయాలి

 https://m.facebook.com/story.php?story_fbid=2299332806776210&id=100000985399037 అమ్మలు నాన్నలూ.. పిల్లలు జాగ్రత్తా ఎండాకాలం వచ్చేస్తోంది అమ్మానాన్నలు పిల్లలు జాగ్రత్త. ఎండదెబ్బ తగులుద్దని జాగ్రత్త చెప్పట్లే. భార్యాభర్తలు ఇద్దరూ పనులకు వెళ్ళే వాళ్ళు మీ పిల్లలు జాగ్రత్త. రెండు నెలల్లో 42అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. అన్నీ మైనర్ పిల్లల పైనే. రెండున్నరేళ్ళ మనవరాలి పై తాత. తొమ్మిదేళ్ళ , నాలుగేళ్ళ బిడ్డల పై తండ్రులు, ఇట్లా ..... నిన్న ఆరేళ్ళ పిల్లపై గొంతులో ఇనుప చువ్వ కుచ్చి మరీ అత్యాచారం.  అమ్మానాన్నలు జాగ్రత్త అడవి కంటే భయంకరమైన సమాజంలో ఉన్నాం మన పిల్లలకు మనమే ప్రథమ రక్ష. ఘోరాలు జరిగినంక ఎంత రోదించినా , నేరస్తులకు ఏ శిక్షలు వేసినా మన పిల్లలు మనకు బాధాతప్త స్మృతులే , గుండెలు పగిలే జ్ఞాపకాలే.  ఇప్పుడు నేను రాసే సుద్దులేవీ స్లమ్ వీథుల్లో పొట్టపట్టుకుని కూలీచేసే వాళ్ళు చదవరు. పసిపిల్లల పై అత్యాచారాలు జరిగేది ఇటువంటి ప్రాంతాల పిల్లల పైనే. సింగిల్ పేరెంట్స్ పిల్లలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ పనిచేసే పిల్లలే కామాంథులకు టార్గెట్లు. మరి బుద్దిజీవులు మానవతా మూర్తులు ఏమి చ...